ASR: రెవెన్యూ సేవల్లో అలసత్వం వద్దని, గడువులోగా ప్రజలకు సేవలు అందించాలని ఆర్డీవో ఎంవీఎస్ లోకేశ్వరరావు సూచించారు. డుంబ్రిగూడలో బుధవారం నిర్వహించిన సమీక్ష సమావేశంలో ఆయన మాట్లాడారు. తప్పులు లేని పట్టాదారు పాస్ పుస్తకాలు పంపిణీ చేయాలని, ఈ-కేవైసీ ద్వారా సవరణలు పూర్తి చేయాలని ఆదేశించారు. ప్రజల ఫిర్యాదులు, పీజీఆర్ఎస్ అర్జీలను త్వరితగతిన పరిష్కరించాలన్నారు.