W.G: మండల కేంద్రం అయిన ఉండిలో జనసేన పార్టీ 13వ ఆవిర్భావ దినోత్సవం వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా గ్రంధాలయం చైర్మన్, ఉండి నియోజకవర్గం జనసేన పార్టీ ఇంచార్జి జుత్తిగ నాగరాజు కేక్ కట్ చేసి వేడుకలను ప్రారంభించారు. ఆయన మాట్లాడుతూ పార్టీ కోసం కష్టపడిన ప్రతీ జనసేన సైనికులకు తప్పనిసరి గుర్తింపు లభిస్తుంది అన్నారు.