KDP: ఈ నెల 30వ తేదీ జరగాల్సిన ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమాన్ని రద్దు చేస్తున్నట్లు జిల్లా రెవెన్యూ అధికారి మల్లికార్జునుడు ఓ ప్రకటనలో పేర్కొన్నారు. ఏప్రిల్ ఒకటో తేదీన ఒంటిమిట్ట కోదండ రామాలయంలో కల్యాణోత్సవం జరుగుతున్న నేపథ్యంలో అధికారులు సంబంధిత కార్యక్రమ ఏర్పాట్లలో ఉన్నందున రద్దు చేసినట్లు తెలిపారు.