సినీ తారల క్రికెట్ ఫిబ్రవరి 26న జరగనుంది. టాలీవుడ్, బాలీవుడ్ తారల మధ్య ఈ క్రికెట్ మ్యాచ్ జరగనుంది. కెసెంట్ క్రికెట్ కప్ (సీసీసీ) పోటీలు హైదరాబాద్ లోని ఎల్బీ స్టేడియంలో నిర్వహించనున్నారు. ఈసారి ‘సే టు నో డ్రగ్స్’ అనే అంశంపై సినీ తారలు, సెలబ్రిటీ క్రికెట్ లీగ్ నిర్వాహకులు అవగాహన కల్పించనున్నారు.
దీనికి సంబంధించి బంజారాహిల్స్ లోని హోటల్ హ్యాత్ ప్లేస్ లో తెలంగాణ హోం మంత్రి మహమూద్ అలీ, సినిమాటోగ్రఫీ మంత్రి తలసాని శ్రీనివాస యాదవ్, ఎమ్మెల్యే బాలరాజుతో కలిసి క్రికెట్ కప్, బ్రోచర్లను ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో బాలీవుడ్ టీమ్ కెప్టెన్ అర్బాజ్ ఖాన్, బిగ్ బాస్6 విజేత రేవంత్, రాజ్ తరుణ్, వరుణ్ సందేశ్, తనీశ్, శ్రావణ్, వీజే సన్ని తదితరులు పాల్గొన్నారు.