ASR: చింతపల్లి మండలం తడ్డపల్లి గ్రామంలో సత్యవతి అనే మహిళ సైబర్ మోసానికి గురైంది. విద్యాశాఖ పేరుతో ఫోన్ చేసిన కేటుగాడు రూ.5,100 చెల్లిస్తే తల్లికి వందనం నగదు తమ ఖాతాలో రూ.18 వేలు వస్తాయని చెప్పి డబ్బులు కాజేశాడు. డబ్బులు రాకపోవడంతో మోసం బయటపడింది. ప్రభుత్వ పథకాల కోసం ముందస్తు చెల్లింపులు ఉండవని అధికారులు హెచ్చరించారు.