MHBD: జిల్లాలో మహాలక్ష్మి ఉచిత బస్సు ప్రయాణ పథకం మహిళలకు ఆర్థిక స్వావలంబనతో పాటు సామాజిక భద్రతను అందిస్తున్నదని కలెక్టర్ స్నేహ శబరీశ్ మంగళవారం తెలిపారు. ఈ పథకం ద్వారా మహిళలు సుమారు రూ.10 వేల కోట్ల వరకు ఆదా చేసినట్లు పేర్కొన్నారు. ఇప్పటివరకు మహిళలు 290 కోట్ల ప్రయాణాలు చేసినట్లు తెలిపారు. ఈ పొదుపు కుటుంబాల అభివృద్ధికి తోడ్పడుతుందని అన్నారు.