VZM: భారతదేశ అత్యున్నత న్యాయ వ్యవస్థ సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు ప్రభుత్వం బోర్డ్ ఆఫ్ విజిటర్స్ ఫర్ ప్రిజనేర్స్ ఏర్పాటు చేశారు. అందులో బాగంగా నాల్గవ అదనపు జిల్లా న్యాయమూర్తి అప్పలస్వామి, న్యాయ సేవ అధికార సంస్థ కార్యదర్శి ఏ కృష్ణ ప్రసాద్ సంయుక్తంగా చీపురుపల్లి సబ్ జైలును మంగళవారం సందర్శించారు. కారాగారంలో ఉన్న ఖైదీలకు న్యాయఅవగాహన సదస్సు నిర్వహించారు.