పెద్దపల్లి ప్రభుత్వ ఆసుపత్రిలో వరుసగా క్లిష్టమైన ఆపరేషన్లు నిర్వహిస్తూ పేదలకు ఆసరాగా నిలుస్తున్నట్లు సూపరింటెండెంట్ డాక్టర్ శ్రీధర్ తెలిపారు. మంగళవారం ఇద్దరు మహిళలకు గర్భసంచిలోని గడ్డలను విజయవంతంగా తొలగించినట్లు పేర్కొన్నారు. అదేవిధంగా మరో ఇద్దరు మహిళలకు గాల్ బ్లాడర్ నెక్లోని స్టోన్స్ను లాప్రోస్కోపిక్ ఆపరేషన్ ద్వారా తొలగించామన్నారు.