NRML: పురపాలక సంఘం సమావేశ మందిరంలో వైస్ ఛైర్మన్ అప్పాల గణేష్ చక్రవర్తి అధ్యక్షతన మంగళవారం బడ్జెట్ సమావేశం నిర్వహించారు. 2026–27 ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన బడ్జెట్పై చర్చిస్తూ ఆదాయం, ఖర్చులు సమీక్షించారు. పట్టణ అభివృద్ధి, మౌలిక వసతులు, పారిశుద్యం, డ్రైనేజీ, రహదారులు, తాగునీటి సరఫరాపై ప్రత్యేక దృష్టి సారించారు.