ASR: అనంతగిరి మండలం జామగూడ వాసుల 78 ఏళ్ల కల నెరవేరింది. మార్దగూడ జంక్షన్ నుంచి కమలాపురం మీదుగా జామగూడ వరకు 3 కి.మీ. బీటీ రోడ్డుకు ఆర్టీసీ జోనల్ ఛైర్మన్ డా.సియ్యారి దొన్ను దొర శంకుస్థాపన చేశారు. రూ.60 లక్షలతో ఈ పనులు చేపడుతున్నారు. ‘అడవి తల్లి బాట’ ద్వారా గిరిజన ప్రాంతాల అభివృద్ధికి కూటమి ప్రభుత్వం పెద్దపీట వేస్తోందని ఆయన తెలిపారు.