VZM: సమస్యలు పరిష్కరించాలని కోరుతూ గజపతినగరం ఐసీడీఎస్ ప్రాజెక్టు పరిధిలో గల అంగన్వాడీలు ముఖ్యమంత్రి చంద్రబాబుతో అడ్రస్ చేస్తూ మంగళవారం పోస్ట్ కార్డు ఉద్యమం సీఐటీయూ ఆధ్వర్యంలో నిర్వహించారు. ప్రాజెక్టు కార్యాలయం వద్ద ధర్నా జరిపిన అనంతరం సీడీపీవోకి వినతి పత్రాన్ని అందజేశారు. సీఐటీయూ జిల్లా ఉపాధ్యక్షురాలు లక్ష్మి ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం జరిగింది.