GDWL: రాజకీయాలకు అతీతంగా కౌన్సిల్ సభ్యులందరూ మున్సిపాలిటీ అభివృద్ధికి సహకరించాలని ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్ రెడ్డి పిలుపునిచ్చారు. మంగళవారం జరిగిన బడ్జెట్ సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. గతంలో పట్టణ ప్రగతికి రూ.18 కోట్లు ఖర్చు చేశామని, భవిష్యత్తులో మరిన్ని నిధులు తెస్తానని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో కలెక్టర్, మున్సిపల్ అధికారులు పాల్గొన్నారు.