MNCL: బెల్లంపల్లి కాంట చౌరస్తా వద్ద బస్టాండ్ నిర్మించాలని కాంగ్రెస్ నాయకులు కొలిపాక శ్రీనివాస్ కోరారు. ఈ మేరకు మంగళవారం మున్సిపల్ కమిషనర్ కార్యాలయంలో వినతిపత్రం అందజేశారు. వివిధ మండలాల నుంచి వేల సంఖ్యలో వచ్చే ప్రయాణికులు వేచి ఉండటానికి సరైన చోటు లేక తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రజా అవసరాల దృష్ట్యా బస్టాండ్ నిర్మించాలన్నారు.