అన్నమయ్య: సానిపాయి, చిన్న గొల్లపల్లి గ్రామపంచాయతీ ప్రజలకు పోలీసుల కీలక హెచ్చరికలు జారీ చేశారు. ఏప్రిల్ 13న జరగనున్న గంగమ్మ జాతర సందర్భంగా చాందిని బండ్లు ఏర్పాటు చేసేవారు తప్పనిసరిగా 24 గంటల ముందే అనుమతి తీసుకోవాలన్నారు. ఆశ్లీల లేదా అనుమతి లేని కార్యక్రమాలు పూర్తిగా నిషేధమన్నారు. నిబంధనలు ఉల్లంఘిస్తే చట్టపరమైన చర్యలు తీసుకుంటామని వీరబల్లి SI సుస్మిత హెచ్చరించారు.