కోనసీమ: కర్నూలు జిల్లాలో న్యాయవాది పవన్ కుమార్పై జరిగిన దాడిని ఆలమూరు బార్ అసోసియేషన్ సభ్యులు తీవ్రంగా ఖండించారు. కర్నూలు పోలీస్ స్టేషన్లో సిఐ విక్రమసింహ న్యాయవాది పవన్పై అనుచిత వ్యాఖ్యలు చేస్తూ దాడి చేసిన ఘటన న్యాయవర్గాలను కలిచివేసిందని వారు పేర్కొన్నారు. సోమవారం న్యాయవాది వేమగిరి నరసింహమూర్తి ఆధ్వర్యంలో ఆలమూరు కోర్టులో విధులు బహిష్కరించారు.