NLG: చిట్యాల మండలంలోని జీపీ వార్డు సభ్యులకు రెండవ విడత శిక్షణా తరగతులు గుండ్రాంపల్లి రైతు వేదికలో ఇవాళ ప్రారంభమయ్యాయి. 20వ వరకు జరిగే శిక్షణకు ఆరెగూడెం, గుడ్రాంపల్లి, సుంకేనేపల్లి, వెలిమినేడు, ఏపూరు, బొంగోనిచెరువు, పిట్టంపల్లి, పేరేపల్లి, పెద్దకాపర్తికి చెందిన 90 మంది వార్డు సభ్యులు హాజరయ్యారు. ఎంపీడీవో జయలక్ష్మి, ఎంపీవో కోటేష్,యూసుఫ్ పాల్గొన్నారు.