SRD: రైతులకు ధర నిర్ణయించకుండా భూమిని సర్వే చేసి భూసేకరణ చేయడం అన్యాయమని మునిదేవునిపల్లి రైతులు ఆందోళన వ్యక్తం చేశారు. సోమవారం కలెక్టర్ ప్రావీణ్య, ఆర్డీవో రాజేందర్కు భూములు కోల్పోతున్న రైతులకు న్యాయం చేయాలని వినతి పత్రం అందజేశారు. పరిశ్రమల పేరుతో భూములను తీసుకుంటే తాము జీవనాధారాన్ని కోల్పోతామన్నారు.