SDPT: బెజ్జంకి మండలంలోని గుండారం ప్రాథమిక పాఠశాలలో 2 నుంచి 5వ తరగతి విద్యార్థులకు సోమవారం క్విజ్ పోటీలు నిర్వహించారు. ఈ కార్య క్రమానికి బెజ్జంకి బాయ్స్ కాంప్లెక్స్ ప్రధానోపాధ్యా యులు శ్రీరాములు ముఖ్య అతిథిగా హాజరై విద్యార్థుల ప్రతిభను పరిశీలించారు. ఇటువంటి పోటీలు విద్యార్థుల మేధస్సును పెంపొందించేందుకు దోహదపడతాయని ఆయన కొనియాడారు.