BHPL: ప్రజావాణిలో సమస్య పరిష్కారానికి ప్రజలు అందచేసిన దరఖాస్తుల పరిష్కారానికి అధికారులు తగు చర్యలు తీసుకోవాలని BHPL కలెక్టర్ రాహుల్ శర్మ ఆదేశించారు. సోమవారం ఐడీఓసీలో ప్రజల నుంచి 70 దరఖాస్తులు స్వీకరించి పరిష్కారానికి చర్యలు తీసుకోవాలని ఆయా శాఖల అధికారులను ఆదేశించారు. అందిన ప్రతి దరఖాస్తును నిశితంగా పరిశీలించి సమస్య పరిష్కారానికి చర్యలు తీసుకోవాలని సూచించారు.