SKLM: ఆరోగ్య సబ్ కమిటీలకు ఎఫ్ఎన్హెచ్డబ్ల్యూ పై మందస వెలుగు కార్యాలయంలో సోమవారం మండల పీవో పైడి కూర్మారావు ఆధ్వర్యంలో శిక్షణ కార్యక్రమం జరిగింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్రతి గ్రామంలో ప్రజల ఆరోగ్యం పై అవగాహన పెంచడం లక్ష్యమని తెలిపారు. ప్రకృతి వ్యవసాయ విధానంలో పండించిన కూరగాయలు, ఆకు కూరలు వినియోగించడం ద్వారా అనారోగ్యాలను దూరం చేసుకోవచ్చన్నారు.