WGL: ఉపాధి హామీ పథకానికి సంబంధించిన పెండింగ్ బిల్లులను వెంటనే చెల్లించాలని తెలంగాణ వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా అధ్యక్షుడు నవీన్ స్వామి, మహిళా కన్వీనర్ మొగులోజు శారద డిమాండ్ చేశారు. సోమవారం పర్వతగిరి మండలం అన్నారం షరీఫ్లో పర్యటించి 125 రోజుల పనిపై ప్రచారం చేస్తున్నప్పటికీ తగిన నిధులు కేటాయించడం లేదని కేంద్ర ప్రభుత్వంపై విమర్శలు గుప్పించారు.