VKB: మర్పల్లి గ్రామ పంచాయతీ పరిధిలో ఏటా నిర్వహించే తై బజార్ బహిరంగ వేలం పాట ఇవాళ నిర్వహించారు. గ్రామ పంచాయతీ కార్యాలయ ప్రాంగణంలో సర్పంచ్ రామేశ్వర్, పంచాయతీ కార్యదర్శి లక్ష్మీకాంత్ ఆధ్వర్యంలో నిర్వహించగా, వ్యాపారస్తులు పోటాపోటీగా పాల్గొన్నారు. ఈ క్రమంలో గ్రామానికి చెందిన కర్నె పెంటయ్య అత్యధికంగా రూ.6,77,000లకు పాడి తై బజార్ ఈ ఏడాది నిర్వహణ హక్కులను దక్కించుకున్నాడు.