KMR: ప్రజల సమస్యలను తక్షణమే పరిష్కరించేందుకు ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న ‘ప్రజావాణి’ కార్యక్రమం’తాడ్వాయి మండల కేంద్రంలో అపహాస్యమవుతోంది. సోమవారం మండల కార్యాలయంలో జరిగిన ఈ కార్యక్రమం అధికారుల నిర్లక్ష్యానికి పరాకాష్టగా నిలిచింది. తమ గోడు చెప్పుకుందామని గ్రామాల నుంచి ఆశతో వచ్చిన సామాన్యులకు అక్కడ వెక్కిరిస్తున్న ఖాళీ కుర్చీలే దర్శనమిచ్చాయి.