JN: తరిగొప్పుల మండల నూతన తహసీల్దార్ను మండల BRS నేతలు కలిశారు. మండలంలోని పలు సమస్యలను తహసీల్దార్ దృష్టికి BRS నేతలు తీసుకెళ్లి సమస్యల సత్వర పరిష్కారమే ప్రధాన లక్ష్యంగా పనిచేస్తూ మండల అభివృద్ధికి కృషి చేయాలని కోరారు. మండల అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి, మాజీ ఎంపీటీసీ జూమ్లాల్ నాయక్, తదితరులు పాల్గొన్నారు.