NLG: చిట్యాల పట్టణ కేంద్రంలో చిట్యాల భువనగిరి రోడ్డుపై సిఐటీయూ ఆధ్వర్యంలో ఆశా వర్కర్ల రాస్తారోకో నిర్వహించారు. ప్రభుత్వం ఆశ వర్కర్ల సమస్యలను పరిష్కరించాలని, పెండింగ్ వేతనాలు ఇవ్వాలని, కనీస వేతనం 18 వేలకు పెంచారని డిమాండ్ చేశారు. రాస్తారోకోతో రోడ్డుపై భారీగా ట్రాఫిక్ జామ్ అయ్యింది. ప్రభుత్వం మొండి వైఖరి వీడి ఆశా వర్కర్లకు న్యాయం చేయాలన్నారు.