NTR: పల్లెల్లో అభివృద్ధి పరుగులు పెడుతోందని, నియోజకవర్గంలో పల్లెపండుగ కింద సీసీ రోడ్ల నిర్మాణానికి రూ. 32.92 కోట్లు కేటాయించామని మైలవరం ఎమ్మెల్యే వసంత వెంకట కృష్ణ ప్రసాద్ పేర్కొన్నారు. విజయవాడ రూరల్ మండలంలోని రాయనపాడు గ్రామంలో రూ.30 లక్షల ఎన్ఆర్ఈజీఎస్ నిధులతో నిర్మించిన సిమెంట్ రహదారులను ఎమ్మెల్యే ప్రారంభించారు.