VZM: గజపతినగరం మండలం మర్రివలస ప్రాథమిక పాఠశాలలో ఇటీవల ప్రారంభించిన ‘నేను చేసిన మంచిపని’ కార్యక్రమం ఫలితాన్ని ఇస్తున్నట్లు పాఠశాల ప్రధానోపాధ్యాయులు కనకల చంద్రరావు సోమవారం తెలిపారు. పాఠశాల విద్యార్థులు తాడి పూజ ముగడ గాయత్రీలకు రూ. 1100లు దొరకగా తమకు దొరికిన డబ్బులను పెద్దల దృష్టిలో పెట్టి పోగొట్టుకున్న వారికి అందజేశారని తెలిపారు.