KNR: గన్నేరువరం మండలంలోని రెవెన్యూ ఆఫీసులో ఖాళీగా ఉన్న పోస్టులను భర్తీ చేయాలని భారత కమ్యూనిస్ట్ పార్టీ మండల కార్యదర్శి శ్రీశైలం, జిల్లా కౌన్సిల్ సభ్యులు అంజిరెడ్డి ప్రజావాణిలో వినతి పత్రం సమర్పించారు. గన్నేరువరంలో భూ సమస్యలు పెండింగ్లో ఉన్నాయని, భూభారతి దరఖాస్తులను వెంటనే పరిష్కరించాలని, సిబ్బందిని నియమించి సమస్యల పరిష్కారానికి చొరవ చూపాలని కోరారు.