TG: అసెంబ్లీలో మంత్రి పొంగులేటికి చెందిన రాఘవ కన్స్ట్రక్షన్స్పై చర్యలు తీసుకోవాలని బీఆర్ఎస్ సభ్యులు పెద్ద ఎత్తున పట్టుబట్టిన విషయం తెలిసిందే. ఆ సంస్థ హైదరాబాద్ శివారులో అక్రమ మైనింగ్ చేస్తోందని ఆరోపించారు. తాజాగా ఈ వ్యవహారంలో తదుపరి కార్యాచరణను బీఆర్ఎస్ చేపట్టనుంది. ఈ మేరకు నార్సింగిలోని కేటీఆర్ నివాసంలో బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు సమావేశం అయ్యారు.