VSP: ప్రముఖ పుణ్య క్షేత్రం సింహాచలం అప్పన్న స్వామి దేవాలయంలో వార్షిక కళ్యాణ మహోత్సవంలో భాగంగా స్వామివారికి రథయాత్ర మహోత్సవం వేడుకగా నిర్వహించారు. శ్రీదేవి భూదేవి సమేత స్వామి వారిని రథంపై అధిష్ఠింపజేసి విశ్వక్సేన ఆరాధన, పుణ్యాహవచనం వంటి క్రతువులు చేశారు. అనంతరం ఆలయ అనువంశిక ధర్మకర్త అశోక్ గజపతిరాజు కుమార్తె అతిధి గజపతిరాజు రథాన్ని ప్రారంభించారు.