E.G: గోకవరం మండలం రంప ఎర్రంపాలెం గంగాభవాని కాలనీలోని శ్రీ కనకదుర్గ దేవికి భక్తులు తిరుపతి రాము, సీతా దంపతులు రూ.1.60 లక్షల విలువైన వెండి కిరీటం సమర్పించారు. ఆదివారం అమ్మవారి సమక్షంలో ప్రత్యేక పూజలు నిర్వహించి కిరీటాన్ని అలంకరించారు. ఈ కార్యక్రమంలో గ్రామస్తులు, భక్తులు పాల్గొని భక్తిశ్రద్ధలతో సేవలు అందించారు.