KRNL: కోడుమూరు పట్టణంలో అరుణోదయ బుక్ సెంటర్ సమీపంలో ఆదివారం రాత్రి రోడ్డు ప్రమాదం జరిగింది. గాయపడిన వ్యక్తిని స్థానికులు వెంటనే ప్రభుత్వ వైద్యశాలకు తరలించారు. పరిస్థితి విషమంగా ఉండడంతో కర్నూలు ప్రభుత్వ ఆసుపత్రికి రిఫర్ చేశారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనపై వివరాలు సేకరించారు. ప్రమాదానికి గల కారణాలు తెలియాల్సి ఉంది.