ATP: డీ.హీరేహల్ మండలం హోసగుడ్డం గ్రామంలో నిర్వహించిన శ్రీ ఆంజనేయ స్వామి రథోత్సవంలో ఎమ్మెల్యే కాలవ శ్రీనివాసులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. నియోజకవర్గ ప్రజలందరిపై ఆంజనేయ స్వామి వారి చల్లని ఆశీస్సులు ఎల్లప్పుడూ ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నట్లు ఆయన తెలిపారు.