AP: ఇతర ప్రాంతాల బోట్లు ఏపీ సముద్ర జలాల్లోకి రాకుండా చూడాలని అధికారులను సీఎం చంద్రబాబు ఆదేశించారు. ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి విజ్ఞప్తి మేరకు ఆదేశాలు జారీ చేశారు. నెల్లూరు జిల్లా మత్స్యకారుల సమస్యలను సీఎంకు సోమిరెడ్డి విన్నవించారు. తమిళనాడు, పుదుచ్చేరి బోట్ల వల్ల ఏపీ మత్స్యకారుల జీవనోపాధి దెబ్బతింటుందని సోమిరెడ్డి తెలిపారు.