కృష్ణా: మోపిదేవి మండలం పెదప్రోలు గ్రామపంచాయతీలో కాంట్రాక్టు లేబర్ టెండర్లలో అవకతవకలు జరుగుతున్నాయని ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. టెండర్లు పిలవకుండా అధికారులకు అనుకూల వ్యక్తులకు పనులు అప్పగిస్తున్నారని, గత నాలుగేళ్లుగా ఫిర్యాదులు చేసినా మార్పు లేదని స్థానికులు అంటున్నారు. జీతాలు ఇష్టానుసారం పెంచుతూ ప్రభుత్వ నిధులు దుర్వినియోగం చేస్తున్నారని విమర్శించారు.