SRD : పటాన్ చెరు ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి రామేశ్వరంబండ సమగ్ర అభివృద్ధికి పూర్తి సహకారం అందిస్తామని హామీ ఇచ్చారు. ఆదివారం ఇంద్రపురి కాలనీలో రూ.10 లక్షల వ్యయంతో సీసీ రోడ్డు పనులకు శంకుస్థాపన చేశారు. మున్సిపల్ ఎన్నికల్లో బీఆర్ఎస్ అభ్యర్థులకు విజయాన్ని అందించిన ప్రజలకు కృతజ్ఞతలు తెలిపారు. హామీలన్నీ ప్రణాళికబద్ధంగా నెరవేర్చుతామని పేర్కొన్నారు.