BHNG: రాచకొండలో రిజర్వాయర్ ఏర్పాటు చేసి సంస్థాన్ నారాయణపురం మండలానికి సాగునీరు అందించాలని CPI చేపట్టిన ప్రచార జాత ఆదివారంతో రెండో రోజుకు చేరుకుంది. ఈ సందర్భంగా CPI జిల్లా కార్యవర్గ సభ్యులు బచ్చనగోని గాలయ్య మాట్లాడుతూ.. సోమవారం ఉదయం 10 గంటలకు తహసీల్దార్ కార్యాలయం ముందు నిర్వహించబోయే మహా ధర్నా కార్యక్రమానికి రైతులంతా పాల్గొని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు.