హనుమకొండ జిల్లా స్థాయి ఛీఫ్ మినిస్టర్స్ కప్ ముగింపు కార్యక్రమాన్ని సోమవారం నిర్వహించారు. క్రీడా పోటీల్లో గెలుపొందిన అభ్యర్థులకు స్థానిక ఎమ్మెల్యే రాజేందర్ రెడ్డి బహుమతులను అందించారు. గ్రామీణ స్థాయి నుంచి జాతీయ స్థాయి వరకు విద్యార్థుల్లో దాగి ఉన్న క్రీడా ప్రతిభను వెలికితీయడం లక్ష్యంగా సీఎం కప్ నిర్వహిస్తున్నట్లు ఎమ్మెల్యే పేర్కొన్నారు.