యాదాద్రి: టీడీపీ పార్టీ 44వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు చౌటుప్పల్లోని పార్టీ కార్యాలయంలో ఆదివారం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా పార్టీ పతాకావిష్కరణ చేసి, వ్యవస్థాపక అధ్యక్షుడు నందమూరి తారక రామారావు విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. అనంతరం కేక్ కట్ చేసి సంబరాలు జరుపుకున్నారు. పలువురు నేతలు, కార్యకర్తలు పాల్గొన్నారు.