PDPL: రామగుండం పోలీస్ కమిషనరేట్ పరిధిలో “అరైవ్-అలైవ్ ఫేజ్-03″లో భాగంగా ఆదివారం పెద్దపల్లి మండలం రాంపల్లిలో ఉచిత కంటి పరీక్ష శిబిరం నిర్వహించారు. డా. అగర్వాల్ హాస్పిటల్ వైద్యులు సుమారు 200 మందికి పరీక్షలు నిర్వహించి, 20 మందికి కళ్లజోళ్లు అందించగా, 5 మందిని శస్త్రచికిత్సకు సూచించారు. ఈ మేరకు ఎస్సై మల్లేష్ ట్రాఫిక్ నియమాలు పాటించాలన్నారు.