TG: HYDలోని గన్పార్క్ అమరవీరుల స్థూపం వద్ద ఆశావర్కర్లు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ను కలిశారు. ఎన్నికల సమయంలో కాంగ్రెస్ ప్రభుత్వం హామీలు ఇచ్చి.. ఇప్పుడు తమ సమస్యలు పట్టించుకోవడం లేదని వివరించారు. ఈ విషయంపై అసెంబ్లీని ముట్టడించినట్లు వారు గుర్తుచేశారు. ఈ అంశంపై స్పందించిన కేటీఆర్ వారికి అండగా ఉంటానని హామీ ఇచ్చారు.