TG: మున్సిపల్ ఎన్నికల సమయంలో సీఎం రేవంత్ రెడ్డి ‘డైవర్షన్ పాలిటిక్స్’ చేశారని కోరుట్ల ఎమ్మెల్యే సంజయ్ విమర్శించారు. స్థానిక సమస్యలైన తాగునీరు, పారిశుధ్యం, అభివృద్ధిని విస్మరించి, ప్రజల దృష్టి మరల్చడమే లక్ష్యంగా ప్రభుత్వం వ్యవహరిస్తోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. BRS నేతలకు ఫోన్ ట్యాపింగ్ కేసులో నోటీసులు ఇవ్వడం కేవలం రాజకీయ కక్ష సాధింపేనని అన్నారు.