అన్నమయ్య: సంబేపల్లి మండల కేంద్రంలో టీడీపీ 44వ ఆవిర్భావ దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి టీడీపీ నాయకుడు లక్ష్మీప్రసాద్ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఎన్టీఆర్ విగ్రహానికి పూలమాలలు అర్పించి నివాళులు ఘటించి, పార్టీ జెండాను ఆవిష్కరించారు. ఆయన మాట్లాడుతూ.. ఎన్టీఆర్ ఆశయాలు ప్రతి కార్యకర్తకు మార్గదర్శకమని, ప్రజాసేవతోనే పార్టీ బలపడుతుందని అన్నారు.