TG: యువత కేవలం చదువులకే పరిమితం కాకుండా, శారీరక వ్యాయామంపై దృష్టి సారించాలని మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు పిలుపునిచ్చారు. ప్రతిరోజూ యోగా, నడక లేదా సూర్య నమస్కారాలు చేయడం ద్వారా మానసిక చైతన్యం పొందుతారని తెలిపారు. ‘దేశమంటే మట్టి కాదోయ్, దేశమంటే మనుషులోయ్’ అన్న గురజాడ మాటలను గుర్తు చేస్తూ, ప్రజలు ఆరోగ్యంగా ఉన్నప్పుడే దేశం శక్తివంతమవుతుందని పేర్కొన్నారు.