అన్నమయ్య: తంబళ్లపల్లి నియోజకవర్గానికి చెందిన కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు ఎంఎన్.చంద్రశేఖర్ రెడ్డి జనసేన పార్టీలో చేరారు. హైదరాబాద్లో కొణిదల నాగబాబు సమక్షంలో పార్టీ కండువా ధరించారు. ఆయన చేరికతో స్థానిక రాజకీయాల్లో కొత్త సమీకరణాలు ఏర్పడే అవకాశముందని రాజకీయ వర్గాలు భావిస్తున్నాయి. ఈ చేరికతో జనసేన పార్టీ కార్యకలాపాలు నియోజకవర్గంలో మరింత వేగవంత కానున్నాయి.