వనపర్తి రూరల్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఓ వ్యక్తిపై దాడి జరిగింది. పట్టణంలోని జంగాల గుట్టకు చెందిన మండ్ల వెంకటేష్పై అతని బామ్మర్ది గుజ్జుల ఎల్లయ్య శుక్రవారం నాగవరం కల్లు దుకాణం వద్ద అకారణంగా గొడవపడి, కల్లు సీసాతో దాడి చేశాడు. ఈ ఘటనలో వెంకటేష్ రక్తగాయమైంది. బాధితుడి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.