NZB: శ్రీనిధి 2024-25 వార్షిక మహాసభలో నిజామాబాద్ జిల్లా రాష్ట్రంలోనే ప్రథమ స్థానంలో నిలిచింది. మంత్రి సీతక్క చేతుల మీదుగా డీఆర్డీవో సాయి గౌడ్ పురస్కారం అందుకున్నారు. రూ.216 కోట్ల లక్ష్యాన్ని పూర్తి చేయడంతో పాటు రుణాల రికవరీలో జిల్లా అగ్రస్థానం సాధించింది. ఈ వేడుకలో కమ్మర్పల్లి మండల సమైక్యకు కూడా అవార్డు అందజేశారు.