భారత గూఢచారి రవీంద్ర కౌశిక్ ఎందరికో స్ఫూర్తిదాయకం. RAW ఏజెంట్గా పాకిస్తాన్ వెళ్లి, నబీ అహ్మద్ షాకిర్గా మారి పాక్ ఆర్మీలో చేరి మేజర్ స్థాయికి ఎదిగారు. భారత్కు కీలక సమాచారాన్ని అందిస్తూ 1983లో దొరికిపోయారు. పాక్ జైలులో చిత్రహింసలు అనుభవిస్తూ 2001లో మరణించారు. ఆయన సాహసానికి మెచ్చిన అప్పటి ప్రధాని ఇందిరా గాంధీ ఆయనకు ‘బ్లాక్ టైగర్’ బిరుదు ఇచ్చారు.