NLG: భువనగిరి తారకరామ నగర్లో నాలుగేళ్ల చిన్నారిపై వీధి కుక్కల దాడి ఘటనపై మానవ హక్కుల కమిషన్లో ఫిర్యాదు నమోదైంది. మున్సిపల్ అధికారుల నిర్లక్ష్యం వల్లే ఈ ఘోరం జరిగిందని ఆరోపిస్తూ న్యాయవాది వినోద్ ఈ ఫిర్యాదు చేశారు. బాధ్యులైన అధికారులపై కఠిన చర్యలు తీసుకోవాలని, అలాగే బాధితుడి కుటుంబానికి తగిన ఆర్థిక నష్టపరిహారం అందేలా చూడాలని ఆయన కోరారు.