AP: మైనింగ్పై విచారణను స్వాగతిస్తున్నామని కేంద్రమంత్రి బండి సంజయ్ అన్నారు. 2024లో అసెంబ్లీ సాక్షిగా ORR టెండర్పై నియమించిన SIT విచారణ ఏమైందని నిలదీశారు. అసెంబ్లీలో ప్రకటనలకే పరిమితమై ఆచరణలో చర్యలు లేకపోతే ప్రజలు అంగీకరించరని తెలిపారు. కేరళ, తమిళనాడు ఎన్నికలు వస్తున్నాయని నిధుల సేకరణకు అసెంబ్లీని వేదికగా వాడుతున్నారా? అని ప్రశ్నించారు.